బాలయోగి స్టేడియంలో చంద్రబాబుకు గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ షురూ

-

హైటెక్ సిటీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం బాలయోగి స్టేడియంలో కొద్దిసేపటి కిందట ప్రారంభమైంది. ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు మద్దతుదారులు, టీడీపీ అభిమానులు భారీగా తరలివచ్చారు. నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. నందమూరి రామకృష్ణ, బాలకృష్ణ అర్ధాంగి వసుంధరాదేవి, గారపాటి లోకేశ్వరి తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమం ప్రారంభంలో చంద్రబాబుపై స్పెషల్ వీడియో ప్రదర్శించారు.

దాదాపు లక్ష మంది ప్రజలు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ సభకు రిజిస్ట్రేషన్స్ ఫుల్ అయ్యాయి. ప్రధానంగా తెలుగు ఐటీ ఫ్రొఫెషనల్ వింగ్ ఆధ్వర్యంలో ఐటీ ఉద్యోగులంతా తరలి వచ్చి చంద్రబాబుకు మద్దతుగా నిలిచారు. చంద్రబాబు రాక్ బ్యాండ్ సాంగ్ ఉర్రూతలూగించింది. బాలయ్య భార్య వసుంధర సహా టీడీపీ నేతలు ప్రముఖులు హాజరయ్యారు.
. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమ చేయలేకపోయినా తెలుగు ప్రొఫెషనల్స్‌ ఇటువంటి కార్యక్రమం చేపట్టడం గొప్ప విషయమన్నారు. తాను సంపూర్ణ మద్దతు తెలుపుతున్నానని చెప్పారు. సంస్కార ఫౌండేషన్‌ అధ్యక్షురాలు, టీడీపీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్‌ తిరునగరి జ్యోత్స్న సంఘీభావం ప్రకటించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news