బీజేపీకి మూడోసారి అవకాశం ఇస్తే.. దేశం ముక్కలు అవడం ఖాయం – VH

-

బీజేపీకి మూడోసారి అవకాశం ఇస్తే.. దేశం ముక్కలు అవడం ఖాయమని ఫైర్ అయ్యారు మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు. బీజేపీ అధికార ప్రతినిధి మహ్మద్ ప్రవక్త మీద చేసిన కామెంట్స్ వివాదమయ్యాయి.బీజేపీ ఆలోచన.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తుందని నిప్పులు చెరిగారు.

బీజేపీ నేతలు రోజు కొక కామెంట్స్ తో వివాదం సృష్టిస్తున్నారు…బండి సంజయ్ మసీదులను తవ్వాలంటాడన్నారు. కర్నాటక లో ఈశ్వరప్ప జాతీయ జెండాను మారుస్తామంటారు.. ఇండియా వీళ్ల జాగీరా ? అని ప్రశ్నించారు. ఇతర మతాల వారిని కించ పరచడమేనా .. బీజేపీ ఏజెండా అని విమర్శించారు.

గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న వారి పరిస్థితి ఏంటి…?
గల్ఫ్ నుంచి మనం చమురు దిగుమతి
చేసుకుంటున్నాం.. ఇవ్వం అంటే ఏంటి పరిస్థితి అని నిప్పులు చెరిగారు. రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన వారిని జైల్లో పెట్టాలి.హిందూ- ముస్లిం మధ్య చిచ్చు పెట్టి ప్రపంచ దేశాల ముందు చులకన చేస్తున్నారన్నారు.
దేశాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు జోడో భారత్ యాత్ర చేపడుతోంది…రేప్ చేసే వారిని మరణశిక్ష విధిస్తే.. ఇలాంటి కేసు తగ్గిపోతాయన్నారు. న్యాయస్థానం త్వరతగతిన నిర్ణయాలు తీసుకుంటే .. నేరాలు తగ్గుతాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version