మనం బానిసలం.. ఆయన రారాజు.. జగన్ మీద చంద్రబాబు సెటైర్లు..!

-

మనం బానిసలం ఆయన రారాజు అనే సీఎం జగన్ ఫీలింగ్ అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీ వేమిరెడ్డి తో పాటు ఆయన భార్య, నెల్లూరి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ టిడిపిలో చేరారు. అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ మీద అగ్రహం వ్యక్తం చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వంటి వ్యక్తి కోసం తాను నెల్లూరు వచ్చానని అన్నారు.

అలాంటి వ్యక్తులని ఎవరూ కూడా వదులుకోకూడదని అన్నారు పార్టీలో వేమిరెడ్డికి అధిక ప్రాధాన్యమిస్తామని అన్నారు వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లా గెలుపు ఈజీ అవ్వబోతుందని కూడా చెప్పారు. సైకో జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా ప్రశ్నిస్తే పని అయిపోయినట్లే అని చంద్రబాబు అన్నారు. జగన్ చేసిన తప్పుని చెప్పినందుకే ఆనం రామనారాయణ రెడ్డి నియోజకవర్గంలో ఒక్క పని కూడా చేయలేదని అన్నారు 45 ఏళ్ల రాజకీయ జీవితం ఉన్న తన పట్ల సీఎం జగన్ ఎలా వ్యవహరించారో చూసారా అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news