నేడు రాయలసీమలో చంద్రబాబు రెండో రోజు పర్యటన

-

నిన్నటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. నిన్న అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మహానాడు, నియోజకవర్గవారీ సమీక్షలు, బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. చంద్రబాబు పర్యటన దృష్ట్యా జిల్లాల్లోని పార్టీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇక ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అయితే నేడు రెండో రోజుకు కూడా చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. నేడు పీలేరు, బాకరాపేట, రంగంపేట, తిరుపతి బైపాస్‌, రేణిగుంటలో చంద్రబాబు పర్యటన కొనసాగనున్నట్లు టీడీపీ శ్రేణులు వెల్లడించాయి. అయితే చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version