రేపు చిత్తూరులో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌..

-

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బుధవారం సొంత జిల్లాకు రానున్నారు. మూడు రోజుల పాటు జిల్లాలో మకాం వేసి పార్టీ కార్యకర్తలు, నాయకులు, వివిధ నియోజకవర్గాల శ్రేణులతో సమావేశమవుతారు. తొలిరోజు జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో పాటు మూడు నియోజకవర్గాల పార్టీ స్థితిగతులపై సమీక్షిస్తారు. రెండోరోజు జిల్లావ్యాప్తంగా వైసీపీ నేతల బాధితులతో ముఖాముఖి సంభిషించిన అనంతరం ఆరు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై అక్కడి నాయకులు, కార్యకర్తలతో సమీక్ష జరుపుతారు.

చివరి రోజు జిల్లా పార్టీ సమన్వయ కమిటీతో సమావేశం కావడంతో పాటు చంద్రగిరి, కుప్పం సహా ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో పార్టీ తీరుతెన్నులపై సమీక్ష నిర్వహిస్తారు. చంద్రగిరి మండలం మామండూరు సమీపంలో జరిగే ఈ మూడు రోజుల కార్యక్రమాల కోసం జిల్లా పార్టీ యంత్రాంగం పెద్దఎత్తున ఏర్పాట్లు చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news