పెద్దిరెడ్డి నీ తడాఖా చూస్తా – చంద్రబాబు

-

మంత్రి పెద్దిరెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. “పెద్దిరెడ్డి తమాషా చేస్తున్నావా.. నీ తడాఖా ఏంటో చూస్తా ” అని హెచ్చరించారు. టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతావా? అని నిలదీశారు చంద్రబాబు. ఏపీలో అత్యవసర పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. పిరికితనంతో తప్పుడు కేసులు పెట్టి తమ పర్యటనలను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

14 ఏళ్ళు నేను అనుకుని ఉంటే నువ్వు జిల్లాలో తిరిగే వాడివా? అని ప్రశ్నించారు. కుప్పం ప్రజలని 50 కోట్లు కట్టాలని అడుగుతావా? అసలు నువ్వు రాజకీయ నాయకుడివేనా? అంటూ మంత్రి పెద్దిరెడ్డి పై ఆరోపణలు చేశారు చంద్రబాబు. జగన్ అరాచకశక్తిగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. పోలీసులు తీసుకువెళ్లిన టిడిపి చైతన్య రథం వాహనాన్ని వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version