ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదు – మంత్రి అప్పలరాజు

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి సిదిరి అప్పలరాజు. ప్రజాస్వామ్యం గురించి చంద్రబాబుకు మాట్లాడే అర్హత లేదని అన్నారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగితే కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదని మండిపడ్డారు. గతంలో ఎమ్మెల్యే రఘు ప్యాకేజీలు ఇచ్చే లాక్కున్న ఆయన ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి సిదిరి.

గత ఎన్నికలలో 23 సీట్లతో ప్రజలు ఓ మూలన కూర్చోబెట్టారని తెలిపారు. ఇక 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు మళ్ళీ బుద్ధి చెబుతారని జోష్యం చెప్పారు. ఆయన ఏ మొహం పెట్టుకొని మళ్ళీ ఓట్లు అడుగుతారని మళ్ళీ పడ్డారు. ముద్రగడ కుటుంబాన్ని చంద్రబాబు వేధించలేదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే రండి తేల్చుకుందామని చంద్రబాబు తొడ కొడుతున్నాడని.. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news