సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ..!

-

టిడిపి అధినేత చంద్రబాబు ఏపి ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. టిటిడి బోర్డు ఏర్పాటు పై బాబు మండి పడ్డారు. 81 మందితో టిటిడి బోర్డ్ ఏర్పాటు పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీయడమేనని టిడిపి అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. బోర్డ్ లో అవినీతి పరులు, నేర చరిత్ర కలిగిన వారు ఉన్నారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ, వ్యాపార ప్రయోజనాల కోసమే బోర్డ్ ఏర్పాటు చేశారు అని చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు. రెండేళ్ల లో తిరుమల కొండపై అనేక అపవిత్ర కార్యక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. వెంటనే సీఎం తన నిర్ణయాన్ని మార్చువాలి…. బోర్డ్ రద్దు చెయ్యాలి అంటూ చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు సభ్యులతో ఈ బోర్డును ప్రకటించారు. బోర్డు లో శివసేన ఇతర పార్టీల నాయకులకు సైతం అవకాశం కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news