పని చెయ్యండి.. ప్రాధాన్యత ఇస్తాము.. చంద్రబాబు హామీ..!

-

మంగళగిరిలో కేంద్ర పార్టీ కార్యాలయంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుతో వడ్డెర సంఘం నాయకులు భేటీ అయ్యారు. మల్లెల జయరాం, వడ్డే వెంకట్ తదితరులు ఈ భేటీ అయ్యారు. సమావేశం తర్వాత మీడియా తో మాట్లాడినా వడ్డెర సంఘం నాయకులు సంచలన కామెంట్స్ చేసారు . ఉమ్మడి అనంతపురం జిల్లాలో వడ్డెర్లకి చట్టసభల్లో స్థానం కల్పించాలని జనాభాపరంగా అధిక శాతం ఉన్న తమకి రెండవ ఎమ్మెల్యే ఒక ఎంపీ స్థానం కేటాయించాలని కోరినట్లు చెప్పారు.

తమ అభ్యర్థనలపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని టికెట్ రాలేదని నిరశపడద్దని పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత స్థానం కల్పిస్తామని చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చినట్లు చెప్పారు. అవినీతి వైసిపిని ఇంటికి పంపేందుకు టిడిపిని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు పని చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version