సీఎం జగన్ పై చంద్రబాబు సెన్షేషనల్ కామెంట్స్..!

-

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యద్ధం కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రోజు రోజుకు ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకోవడం గమనార్హం. తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం జగన్ పై కడపలో నిర్వహించిన ప్రజాగళం సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో వైసీపీకి ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలేనని కడప ప్రజాగళం సభలో టీడీపీ చీఫ్ చంద్రబాబు విమర్శించారు. నేరాలు-ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్ డీ చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్ చనిపోతే మిత్రుడిని కోల్పోయామని బాధపడ్డామని, కానీ జగన్ మాత్రం అంత్యక్రియలకు ముందే సీఎం కావాలని సంతకాల సేకరణ చేపట్టాడని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనేదే కూటమి ఆలోచనని, అందుకు అందరం త్యాగాలు చేశామని చంద్రబాబు గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version