ఏపీని మళ్ళీ పునర్ నిర్మాణం చేయాలి : చంద్రబాబు

-

ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడంమే కాదు.. ఆంద్రప్రదేశ్ ను పునర్ నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. తెలుగుదేశం పార్టీ తరుపున లాభాలు పొందిన వ్యక్తి సీపీఐ నారాయణ అని.. నన్ను ఎప్పుడు విమర్శించారు… ఇప్పుడు అర్థం చేసుకున్నారు. నేను ప్రతి విమర్శ చేయలేకుండా సద్విమర్శగా తీసుకున్నానని చెప్పారు.

చిత్త శుద్ధితో ఉన్న కార్యకర్త… ఒకే వ్యక్తి ఒకే పార్టీ కంభంపాటి రాంమోహన్ అని వెల్లడించారు. చాలా మంది దగ్గర ఉంటే శత్రువులు అవుతారు కానీ… కంభంపాటి అలా కాదని కొనియాడారు. కంభంపాటి రాంమోహన్ ఎన్నో పదవులు నిర్వహించారని.. ప్రతీ ఒక్కరికి ఒక వ్యాపారమో, ఇల్లు గడిచే విధంగా ఉంటే బాగుంటుందని నేను ఎప్పుడు చెబుతానని వెల్లడించారు.

రాజకీయాన్ని వ్యాపారం చేసుకుంటే అవినీతి జరుగుతుందని.. ఇవాళ 40 సంవత్సరాల పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో జరుపుకుంటామని ప్రకటన చేశారు. ఎన్టీఆర్ 100 సంవత్సరాల జయంతి వేడుకలు రాబోయే సంవత్సరంలో ఉంటుందని.. ప్రజల మేలు కోసం మేము పని చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version