ఛార్మిని విపరీతంగా టార్చర్ పెడుతున్న బయ్యర్స్..!!

-

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా రిలీజ్ కు ముందు వున్న హైప్ చూస్తే అందరూ ఇది 500 కోట్ల సినిమా అనుకున్నారు. ఎందుకంటే విజయ్ ఇండియా మొత్తం చుట్టి సూపర్ హైప్ తెచ్చాడు. ఇక అందులోనూ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ నటించాడు అని ఉదరగొట్టారు. ఇక ఇంటర్వ్యూ లలో పూరి, ఛార్మి చూపిన కాన్ఫిడెన్స్ తో ఇదేదో బ్రహ్మాండమైన సినిమా అని అందరూ ఆశలు పెట్టుకున్నారు. పైపెచ్చు మంచి రేటుకు ఓటిటి వాళ్ళు అడిగినా ఇవ్వలేదు అనేసరికి బయ్యర్స్ వేలం వెర్రిగా ఎగబడి ఎక్కువ పెట్టి కొన్నారు.

ఇక విడుదల తర్వాత  సినిమా మీద విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. దానితో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దాంతో  డిస్ట్రిబ్యూటర్లు అందరూ నష్టాల పాలు అయ్యారు. అయితే ఇప్పుడు వీరు పూరి ఆఫీస్ కి వెళ్లి,పూరీ ని కలిసి తమ నష్టాల గురించి అడుగుదాం అని చూస్తున్నారట.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్లు పరిస్థితి మరీ చాలా దారుణంగా వుందట. వాళ్ళు ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదట. ముందుగా ఛార్మిని నష్టాలు భర్తీ చేయాలని అడిగితే, ఛార్మీ మాత్రం మేం కూడా చాలా నష్టపోయామని, ప్రమోషన్స్ కు చాలా మొత్తం ఖర్చు అయ్యింది అని చెప్పిందట. కాని బయ్యర్స్ మాత్రం ఎంతో కొంత సెటిల్ చేయాలని వదలకుండా టార్చర్ పెడుతున్నారట.

ఇక పూరీ కూడా ఏమి చెప్పక పోతే  ఫిల్మ్ ఛాంబర్ వద్ద పంచాయితీ పెట్టాలని చూస్తున్నారట. అలాగే  తమకు రావాల్సిన డబ్బులు వెంటనే చెల్లించి  తరువాత  సినిమాను  మొదలు పెట్టాలని గోల చేస్తున్నారట. పూరీ జగన్నాథ్, ఛార్మి మాత్రం  తర్వాత తీసే సినిమా ను తక్కువ రేట్లకు ఇస్తామని అప్పటిదాకా వెయిట్ చేయాలని చెప్పారట. దానికి బయ్యర్స్ ఒప్పుకోవడం లేదట. కాని హీరో విజయ్ దేవరకొండ మాత్రం కొంత డబ్బును వెనక్కి ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా వుండగా పూరీ మాత్రం 3 నెలల్లో కంప్లీట్ అయ్యే కథ రాసుకొని బాలయ్య వంటి హీరోల వెంట పడుతున్నాడట. బాలయ్య బాబుకేమో చాలా కమిట్ మెంట్స్ వున్నాయి. చివరకు ఈ సమస్య కు ఏమి సొల్యూషన్ దొరుకుతుందో వేచి చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news