చెన్నమనేని రమేశ్ ఎమ్మెల్యేగా తీసుకున్న జీతం తిరిగిచ్చేయాలి : సీపీఐ నారాయణ

-

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ తీసుకున్న ప్రభుత్వ జీతమంతా తిరిగి ఇచ్చేయాలని సీపీఐ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. ఆయన న్యాయ వ్యవస్థలను,కేంద్ర ప్రభుత్వాన్ని మోసం చేశారని విమర్శించారు.

భారత పౌరుడు కాకపోయినా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ప్రభుత్వ జీతం తీసుకున్నాడని..అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టుకొని అనేక వ్యాపారాలు చేసుకుని లబ్ధి పొందాడన్నారు. అందుకే ఆయన తీసుకున్న ప్రభుత్వ జీతం అంతా తిరిగి ఇచ్చేయాలని..దీనిపై అవసరమైతే తాను కోర్టును కూడా ఆశ్రయిస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టంచేశారు. కాగా, చెన్నమనేని ఇండియన్ సిటిజన్ కాదని.. జర్మనీ పౌరుడని అటు కేంద్రంతో పాటు తెలంగాణ హైకోర్టు సైతం స్పష్టంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news