వైఎస్సార్సీపీ హయాంలో ముంబయి నటి కాదంబరీ జెత్వానీపై నమోదైన అక్రమ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో అరెస్ట్ చేసిన ఆయణ్ను విజయవాడలోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. జగన్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పని చేసిన ఆయన ఈ నటి కేసులో ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు.
ఇక హైదరాబాద్ నుంచి విజయవాడలోని సీఐడి కార్యాలయానికి తీసుకువచ్చిన అధికారులు ఈ కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. పీఎస్ఆర్తో పాటు సీఐడీ పోలీసులు పలు కీలకపత్రాలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా వాటి ఆధారంగా ఆయణ్ను ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. విజయవాడ మాజీ సీపీ కాంతి రాణా టాటా, ఐపీఎస్ విశాల్ గున్నితో పాటు ఆంజనేయలు సస్పెన్షన్లో ఉన్నారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ఏ1గా ఉండగా.. ఐపీఎస్ ఆంజనేయులును పోలీసులు ఏ2గా చేర్చారు.