తుడా చైర్మన్, టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా

-

ఆంధ్ర ప్రదేశ్ లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి చవి చూసింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపడుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో నామినేట్ పదవులు అనుభవించిన వారంతా తమ పదవులకు రాజీనామా చేస్తు్న్నారు.

ఇప్పటికే మొత్తం కార్పొరేషన్ పదవులకు వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు రాజీనామాలు చేయగా ,తాజాగా తుడా చైర్మన్ పదవితో పాటు టీటీడీ పాలకమండలి సభ్యుడి పదవికి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి రాజీనామా చేశారు.

2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి నుంచి గెలుపొందడంతో ఆయన తనయుడు మోహిత్ రెడ్డిని తుడా చైర్మన్‌గా ఎన్నుకున్నారు.తాజాగా జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి మోహిత్ రెడ్డి పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పులివర్తి నానిపై ఓటమి పాలయ్యారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది.తుడా చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు మోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news