పవన్ కళ్యాణ్ పై జనసేన గూస్ బంప్స్ వీడియో!

-

ఆంధ్రప్రదేశ్లో పలుమార్లు వైయస్ జగన్ హిందూ ఆలయాలపై దాడులు చేపించిన సంగతి తెలిసిందే.హిందూ దేవాలయాలపై జరిగిన ఘటనలకు సంబంధించి పవన్ కళ్యాణ్ పలుమార్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతం కూటమి అధికారంలోకి రావడంతో ఆంధ్ర ప్రదేశ్ లోని హిందూ ఆలయాలపై జరిగిన దాడులను ఉద్దేశించి జనసేన ట్వీట్ చేసింది. సనాతన ధర్మంతో నడిచే దేశంలో పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని పవన్ హెచ్చరించిన వీడియోను పంచుకుంది. ‘హద్దు దాటితే నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా’ అన్న పవన్ డైలాగ్, జనసేన ఘన విజయం, జనసేనానిపై మోదీ ప్రశంసలను వీడియోలో పొందుపరిచి గేమ్ ఛేంజర్ పీకే అంటూ పేర్కొంది. ఈ వీడియో గూస్బంప్స్ తెప్పిస్తోందని జనసైనికులు పోస్టులు చేస్తున్నారు.

కాగా, వైఎస్ జగన్‌ నియంతృత్వ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమికి పట్టం కట్టారు.కూటమి దెబ్బకు వైసిపి పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news