ఉప్పల్ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, విక్టరీ వెంకటేష్

-

హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య 17వ మ్యాచ్ జరుగుతుంది.ఇక ఈ మ్యాచ్ కి సీఎం రేవంత్ రెడ్డి ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి వెళ్లారు. ప్రస్తుతం సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ను సీఎం ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. హీరో వెంకటేశ్ సీఎం పక్కన కూర్చొని సందడి చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు మ్యాచ్ను వీక్షిస్తున్నారు.

కాగా, ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక ఈ మ్యాచ్ కు ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు హెడ్ దూరం అయ్యాడు. అతని స్థానంలో నితీష్ రెడ్డి ఎంట్రీ ఇచ్చాడు. మరి ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్లో ఎవరు విజేతగా నిలుస్తారో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version