షబ్బీర్ అలీ ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంజాన్ సెలబ్రేషన్స్

-

రంజన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ ఇంటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లారు. షబ్బీర్ అలీ, ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం షబ్బీర్ ఇంట్లో జరిగిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ చార్జీ దీపాదాస్ మున్షితో పాటు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధి దానం నాగేందర్, మంత్రులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగ రంజాన్ అని అన్నారు.రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని సీఎం ఆకాంక్షించారు. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల అనంతరం జరుపుకునే ఈ రంజాన్ పండుగ ఎంతో గొప్పదని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సమన్యాయం సీఎం రేవంత్ రెడ్డి జరుగుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news