IPL 2024 : చెలరేగిన దినేష్ కార్తీక్… ముంబై టార్గెట్ ఎంతంటే?

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  17వ సీజన్ లో భాగంగా ఇవాళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు , ముంబై ఇండియన్స్ మధ్య 25 వ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లలో విరాట్ కోహ్లీ 3 పరుగులు చేయగా, విల్ జాక్స్ 8 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రజత్ పాటిదర్ , డూప్లేసిస్ 3వ వికెట్ కి 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.కెప్టెన్ డూప్లేసిస్ 40 బంతుల్లో 61 పరుగులు చేశారు. రజత్ పాటిదర్ హాఫ్ సెంచరీ తో రాణించాడు.మహిపాల్ లామ్రార్, విజయ్ కుమార్ డక్ ఔట్ అయ్యారు. ఇక చివర్లో దినేష్ కార్తీక్ బంతుల్లో 5 బౌండరీలు , 4 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో ఆర్సీబీపై ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా నిప్పులు చెరిగారు. ఐదు వికెట్లతో చెలరేగారు. ముంబై బౌలర్లలో కొయెట్టీ, మధ్వాల్, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Latest news