Chiranjeevi Pawan Kalyan:రేపు చిరు, ప‌వ‌న్‌ల రాజమండ్రి పర్యటన.. కార‌ణ‌మ‌దేనా!

-

Chiranjeevi Pawan Kalyan: మెగా అభిమానుల‌కు గుడ్ న్యూస్‌. మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్. శుక్రవారం రాజమండ్రిలో ప‌ర్యాటించ‌నున్నారు. ప‌ట్ట‌ణంలోని అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలను సంద‌ర్శించ‌నున్నారు. అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ క‌ళాశాల ఆవరణలో అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

ఈ నేపథ్యంలో చిరంజీవి, ప‌వ‌న్‌ల‌కు భారీ ఎత్తున ఘనస్వాగతం చెప్పేందుకు అభిమానులు రానున్నారు. దీంతో ఏపీ పోలీసులు భద్రతా చర్యలు చేపడుతున్నాయి. అయితే ఆంధ్రాలో పవన్, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న వేళ ఈ ప‌ర్య‌ట‌న స‌ర్వ‌త్రా ఆస‌క్తి రేపుతుంది. ఈ స‌భ‌లో చిరు, ప‌వ‌న్‌లు ఏలాంటి వ్యాఖ్య‌లు చేస్తారని ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉంటే.. అక్టోబర్ 2న రాజమండ్రిలో పవన్ క‌ళ్యాన్ మరో మారు ప‌ర్య‌ట‌న చేయ‌నున్నారు. ఇప్పటికే ఈ ప‌ర్య‌ట‌న కోసం జనసేన నాయకులు జిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు. భద్రత కల్పించాలని కోరారు. చిరు, పవన్ వరుస పర్యటనల నేపథ్యంలో జిల్లా రాజ‌కీయాల్లో అటు ఫ్యాన్స్‌లో సంద‌డి నెల‌కుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version