చిరంజీవి, పవన్ మల్టీ స్టారర్…?

-

ఎప్పుడో మూడేళ్ళ క్రితం సుబ్బిరామిరెడ్డి ఒక ప్రకటన చేసారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో తాను మల్టీ స్టారర్ సినిమా చేస్తా అని దానికి కథ కూడా రెడీ అయిందని దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది అని ఆయన ప్రకటించారు. ఆ తర్వాత దీనికి సంబంధించి ఏ ఒక్క ప్రకటన కూడా రాలేదు. రెండు మూడు సార్లు ఆయన దీనిపై ప్రకటనలు చేసినా సరే అది ముందుకి వెళ్ళే పరిస్థితి ఎక్కడా కనపడలేదు.

చిరంజీవి చేయడానికి ఆసక్తిగా ఉన్నా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటంతో ఈ సినిమా ముందుకి వెళ్ళే అవకాశం లేదనే ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వీరు చేసే సినిమా ఖరారు అయింది అంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం మహేష్ బాబుని తీసుకునే ప్రయత్నం చేయగా అందుకు మహేష్ ఆసక్తి చూపించలేదు అనే వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత మళ్ళీ రామ్ చరణ్ ని అనుకున్నారు. రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా రష్మిక మంధనని కూడా ఖరారు చేసారు. కాని రామ్ చరణ్ కి రాజమౌళి అనుమతి ఇవ్వలేదని అందుకే మూడు నెలల పాటు ఈ సినిమాకు రాజమౌళి వచ్చే అవకాశం లేదని అన్నారు. ఇప్పుడు ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ ని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో చిరంజీవి మాట్లాడినట్టు తెలుస్తుంది. కొరటాల కూడా దీనిపై ఆసక్తి చూపించినట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version