నంది అవార్డు పేరు మార్పు పై స్పందించిన చిరంజీవి..!

-

మెగాస్టార్ చిరంజీవి నంది అవార్డు పేరు మార్చడం పై స్పందించారు. పద్మా అవార్డు గ్రహీతలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆదివారం శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవార్డు గ్రహీతల్ని సత్కరించారు. సత్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అవార్డు ప్రకటన కంటే సత్కారం మరింత ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు.

అవార్డు ప్రకటన తర్వాత ఇటువంటి సన్మానాలు జరగడం ఇదే మొదటిసారి అని అన్నారు స్వయంగా ప్రభుత్వం చొరవ చూపిటమని సన్మానించడం ఆనందంగా ఉందని చెప్పారు చిరంజీవి. నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా మార్చడం వ్యక్తిగతంగా తనకి కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పారు. ఎక్కడ కళాకారులను గౌరవిస్తారో ఆ రాజ్యం చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్పారు పద్మ విభూషణ్ అవార్డు ప్రకటన చూసి నాకు పట్టలేనంత ఆనందం కలిగిందని చిరంజీవి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news