అచ్చం సినీ ఫక్కీలో విగ్రహాలు దొంగతనం.. తెలిస్తే అవాక్కె!

-

ఒడిషా: అచ్చం సినీ ఫక్కీలో దొంగతనం జరిగింది. గుడిలో విగ్రహాలు చోరీ చేసిన దొంగ పోలసులను ముప్పు తిప్పలు పెట్టారు. విగ్రహాలు చోరీ చేసి దొరక్కుండా ఉండేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసేవాడు. అలా కొట్టేసిన విగ్రహాలను అమ్ముకుని జల్సాలు చేసుకునే వాడు. ఇటీవల కాలంలో కూడా పట్టా ముంబై పోలీసుస్టేషన్ పరిధి దండిసాహి గ్రామ రామాలయంలోని విగ్రహాలను దొంగ భారత్ మల్లిక్ దొంగిలించాడు. దీంతో మల్లిక్‌ను పట్టుకునేందుకు పోలీసులు నిందితుడి ఇంటికి వెళ్లాడు.

కానీ దొంగ తెలివిగా బ్రాహ్మణి నదిలో దూకి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. దొంగ మల్లిక్ గజ ఈతగాడు కావడంతో పోలీసులను ముప్పు తిప్పలు పెట్టారు. చివరకు అగ్రిమాపక సిబ్బంది సహాయంతో రెండు పడవలను ఉపయోగించి రెండు గంటల తర్వాత నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. దీంతో మల్లిక్ నుంచి రెండు విగ్రహాలతో పాటు విలువైన సామగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తమదైన స్టైల్లో విచారించడంతో ఎన్ని దొంగతనాలు చేశాడో నిందితుడు ఒప్పుకున్నారు. అంతేకాదు సినిమాలు చూసి దొంగతనం ప్లాన్ చేసినట్లు తెలిపారు. దీంతో దొంగ మల్లిక్‌పై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version