బ్రేకింగ్: రఘు కొంప ముంచిన కామెంట్స్ అవేనా…?

-

వైసీపీ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా రఘురామ కృష్ణం రాజుని సిఐడీ అధికారులు విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఇక రఘురామ కృష్ణం రాజుకి సాంకేతిక పరిజ్ఞానం అందించింది ఎవరు…? రఘురామ కృష్ణం రాజుతో పాటు కుట్రలో ఎవరు ఎవరు ఉన్నారు…? అనే అంశాలను సిఐడీ అధికారులు విచారిస్తున్నారు.

రఘురామ కృష్ణం రాజు బెయిల్ పై నేడు విచారణ జరగనుంది. ఆయనను గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి అక్కడ వైద్య పరిక్షలు నిర్వహించిన అనంతరం సి ఐ డీ అధికారులు విచారించే అవకాశం ఉంది. కుల ఘర్షణలను రెచ్చగొట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారని అందుకే ఆయన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version