వైసీపీలో ఆగని ఎంపీ , ఎమ్మెల్యేల గొడవలు

-

ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ బలంగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట నాయకుల మధ్య విభేదాలు చిరాకుగా మారాయి. రాజకీయంగా బలంగా ఉన్న సమయంలో ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడుతున్నారు. కళ్యాణదుర్గం వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. గోళ్ల గ్రామ శివారులో రాళ్లు, కట్టెలతో దాడి చేసుకున్న ఇరువురు వర్గీయులను పోలీసులు చెదరగొట్టారు.

దాడిలో ఎమ్మెల్యే వర్గానికి చెందిన మోహన్ రెడ్డి, టీడీపీకి చెందిన రామ్మోహన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గోళ్ల గ్రామానికి చెందిన సూరి, అతని వర్గీయులు దాడి చేసారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఎప్పటి నుంచో ఇక్కడ విభేదాలు ఉన్నా సరే వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆరా తీసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version