రామాయపట్నం పోర్టు పనులకు సీఎం జగన్‌ భూమిపూజ.. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

-

రామాయపట్నం పోర్టు పనులకు సీఎం వైయస్‌.జగన్‌ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చెన్నై అయినా, విశాఖ అయినా, ముంబై అయినా మహానగరంగా ఎదిగాయంటే అక్కడ పోర్టు ఉందని.. పోర్టు రావడం వల్ల ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకుంటాయి.. పోర్టు వల్ల ట్రాన్స్‌పోర్టు ఖర్చుకూడా బాగా తగ్గుతుందని తెలిపారు.

రాష్ట్రానికే కాదు, ఈప్రాంతం రూపురేఖలు మారుతాయని.. రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమల వచ్చినా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని చట్టం తీసుకు వచ్చామని ప్రకటించారు. పోర్టులోకాని, దీనికి అనుబంధంగా ఉన్న వచ్చే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయని వెల్లడించారు.

మన దగ్గర దాదాపు 6 పోర్టులు ఉన్నాయి.. కృష్ణపట్నం, కాకినాడలో 2, విశాఖపట్నం, గంగవరం తదితర పోర్టుల ద్వారా ఎగుమతులు, దిగుమతులు కొనసాగుతున్నాయని చెప్పారు. దీనికి మరో 4 పోర్టులు అదనంగా వస్తున్నాయి.. భావనపాడు, కాకినాడ గేట్‌వే, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులను నిర్మిస్తున్నామన్నారు. వీటిద్వారా మరో 100 మిలియన్‌ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం వస్తుందని.. దీంతో పాటు 9 ఫిషింగ్‌ హార్బర్లు కూడా కడుతున్నామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version