సొంత కొడుకుపైనే చంద్రబాబుకు నమ్మకం లేదు : సీఎం జగన్

-

సొంత కొడుకుపైనే నమ్మకం లేక దత్త పుత్రుడికి ఫ్యాకేజ్ ఇచ్చారని చంద్రబాబు పై ధ్వజమెత్తారు సీఎం జగన్. చంద్రబాబు గొడవలు సృష్టించి శవ రాజకీయాలు చేసేందుకు కుట్ర పన్నారని విమర్శించారు. సోమవారం నగరిలో బటన్ నొక్కి విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి 9,32,235 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రీయంబర్స్ మంట్ ను అందించారు. బటన్ నొక్కి రూ.680.44 కోట్లను 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని సీఎం జగన్ విమర్శించారు. అధికారం కోసం బాబు ఎంతకైనా తెగిస్తాడని.. పిల్లనిచ్చిన మామను కూడా వెన్నుపోటు పొడిచాడని ప్రస్తావించారు. చంద్రబాబు ప్రతీ అడుగు కుట్రలు, కుతంత్రాలేనని మండిపడ్డారు. పుంగనూరులో అల్లర్లు సృష్టించి పోలీసులపై దాడి చేశారని దుయ్యబట్టారు. ఇంత దారుణమైన అబద్దాలు చెప్పగలిగే వ్యక్తి ఎవ్వరూ లేరని పేర్కొన్నారు. రాష్ట్రంలో దొంగ ఓట్లను తొలగిస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version