విద్యార్థులకు జగన్ శుభవార్త .. 12663 స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమం !

-

విద్యాకానుక పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, వైయస్సార్‌ స్టీల్‌ప్లాంట్‌ తదితర కార్యక్రమాలు, అంశాలను సమీక్షించారు సీఎం జగన్. ఈ సందర్భంగా విద్యాకానుకపై సీఎం జగన్ కీలక ఆదేశాలు చేశారు. 2021–22 విద్యాకానుక కోసం 790 కోట్లకుపైగా ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నట్లు.. విద్యా కానుక కింద పిల్లలకు నోట్‌ పుస్తకాలు, షూలు, డిక్షనరీ, స్కూలు బ్యాగు, బెల్టు, యూనిఫాం, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

జగనన్న గోరు ముద్దకోసం 2021–22లో 1625 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మనబడి నాడు –నేడు మొదటి విడతకు ఇప్పటి వరకూ రూ.3650 కోట్లు ఖర్చు చేశామని.. రెండో విడత కింద 12663 స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమం నిర్వహించాలని వెల్లడించారు. దీని కోసం దాదాపు రూ.4,535 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశమని.. విద్యారంగంలో నాడు నేడు ను సమర్థవంతంగా ముందుకు సాగాలన్నారు.

రోడ్ల పైనా సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమరావతి ప్రాంతానికి వెళ్లే కరకట్ట రోడ్డు విస్తరణ పై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల అమరావతి వెళ్లడానికి మంచి రోడ్డు సౌకర్యం ఏర్పాటవుతుందన్న సీఎం జగన్.. రాష్ట్రంలో జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల ఏర్పాటుపైనా సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.30వేల కోట్లకుపైగా మౌలిక సదుపాయల కోసం ఖర్చు చేయాలని.. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుల నిర్మాణంపైనా సమీక్ష నిర్వహించారు. పోర్టులతో పాటు షిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలు వేగంగా సాగేలా చూడాలన్నారు సిఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version