వాళ్ళను టార్గెట్ చేసిన జగన్…!

-

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ దూకుడుగా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా సరే సంక్షేమ కార్యక్రమాల విషయంలో సిఎం జగన్ ఎక్కడా కూడా లోటు చేయడం లేదు. ఈ తరుణంలోనే రాజకీయంగా కూడా జగన్ కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నారు. తెలుగు దేశం పార్టీ నుంచి ఎవరు అయితే గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారో వారు అందరిని గుర్తించాలని జగన్ భావిస్తున్నారు.

అవును గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరి మీద కూడా ఆయన ఫోకస్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తన సొంత సామాజిక వర్గానికి ఎక్కువగా కాంట్రాక్ట్ లు ఇచ్చారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో పాటుగా కొందరి విషయంలో జగన్ ఇప్పుడు దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు వాళ్ళ అవినీతిని కూడా బయటకు లాగే ప్రయత్నం జగన్ చేస్తున్నారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అదే విధంగా నెల్లూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి నారాయణ తో పాటుగా మరి కొందరు మాజీ మంత్రుల మీద కూడా జగన్ ఫోకస్ చేసారు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో దీనిపై దూకుడుగా సర్కార్ ఉందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version