మూడేళ్ల పాలనపై సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్

-

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటింది. దీంతో అధికారంలో ఉన్న వైసీసీ ఈ మూడేళ్లలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చామో ఇంటింటికి వెళ్లి తెలియజేస్తున్నారు. తాజాగా తన మూడేళ్ల పాలనపై సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘‘మీరు చూపిన ప్రేమ‌, మీరు అందించిన ఆశీస్సుల‌తో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న‌ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటూ గ‌డిచిన మూడేళ్ల‌లో 95శాతానికి పైగా హామీల‌ను అమ‌లు చేశాం. ఎన్నో మంచి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మ‌రొక్క‌సారి అందరికీ కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నా.’’ అంటూ ట్వీట్ చేశారు. వైసీసీ ప్రభుత్వం ప్రజలతో మమేకం అవ్వడంతో కోసం మంత్రులంతా కలిసి సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర చేశారు. తాము ఈ మూడేళ్లలో అమలు చేసి పథకాలను వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version