సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ నీ ఇరికించాలని చూస్తున్నారు.. ఎమ్మెల్యే వివేకానంద గౌడ్

-

సీఎం  రేవంత్ రెడ్డి కేటీఆర్ ను ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు అని ఎమ్మెల్యే వివేకా నంద గౌడ్ పేర్కొన్నారు. తాజాగా మీడియా తో మాట్లాడారు. హమీలు ఇచ్చి మాట తప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేటీఆర్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ప్రజల్ల ఆదరణ తగ్గుతోంది.  కేటీఆర్ పై అసూయతో వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి దూషణలు చేస్తున్నారు. కేటీఆర్ బావమరిది స్వంత ఇంట్లో కుటుంబ సభ్యులతో పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

సీఎం  రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేశారు. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సిండ్రోమ్ పట్టుకుంది,కేటీఆర్ ఫోబియా పట్టుకుంది. స్వయంగా రాజ్ పాకాల ఇంటికి పోలీసులు,ఆబ్కారీ వాళ్ళు వెళ్లి సెర్చ్ చేశారు. ఎలాంటి సెర్చ్ వారెంట్ లేకుండా రాజ్ పాకాల కుటుంబ సభ్యులను పోలీసులు ఇబ్బంది పెట్టారు. అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. రిటైర్ అయినా మేము అధికారంలోకి వచ్చాక ఇబ్బంది పెట్టిన అధికారులను వదలం అన్నారు. రేవంత్ రెడ్డి కొత్త నాటకానికి తెరలేపారు. స్వంత ఇంట్లోపార్టీ చేసుకోవద్దా..? పంచనామా రిపోర్టులో ఫారెన్ లిక్కర్ ఉన్నట్లు తేలింది. మా ఎమ్మెల్యే ఇటీవల ప్రయివేటు పార్టీకి వెళ్లి వస్తుంటే ఇరికించే ప్రయత్నం చేశారు. కేటీఆర్ పై బురదచల్లాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ పాకాల కొత్త ఇళ్లు కట్టుకుని గృహ ప్రవేశం చేశారు. రాజ్ పాకాల ఇంట్లో కేటీఆర్, కేటీఆర్ సతీమణి లేరు.  కేటీఆర్ ను మానసికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version