మూసీ నది పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన

-

మూసీ నది పై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి కీలక ప్రకటన చేశారు. ఇవాళ హైదరాబాద్ లో నిర్వహించిన సదర్ ఉత్సవం లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. యాదవులకు రాజకీయంగా మరిన్నీ అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. యాదవులు ధర్మం వైపు నిలబడుతారని పేర్కొన్నారు. ధర్మం వైపు నిలబడిన ఎవ్వరూ అన్యాయానికి గురికారు అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి పై యాదవుల పాత్ర కీలకమైనదని పేర్కొన్నారు. 

అంతేకాదు.. హైదరాబాద్ ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే బాధ్యత కాంగ్రెస్ పార్టీదని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని పేర్కొన్నారు. మూసీ నదిని ప్రక్షాళన చేయాలని.. నిర్ణయించాం. మూసీ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని మరోసారి కీలక ప్రకటన చేశారు. మూసీ నదిలో నరకాన్ని అనుభవిస్తున్న ప్రతీ పేద వాడి జీవితంలో వెలుగులు నింపుతామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసా కల్పించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version