కొమురం భీమ్‌, వాల్మీకీలకు సీఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి

-

జల్ జంగల్ జమీన్ నినాదంతో రాచరికం వ్యవస్థపై గొంతెత్తిన గోండు వీరుడు, విప్లవవీరుడు కొమురం భీమ్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలోని ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సంస్కృత ఆదికవి, రామాయణ మహాకావ్య రచయిత మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.రామాయణాన్ని మహా కావ్యంగా మలిచి జాతికి అంకితం చేయడంతో పాటు మార్గదర్శాన్ని నిర్దేశించిన మహోన్నతలు మహర్షి వాల్మీకి అని కొనియాడారు. ప్రజా ప్రభుత్వం వాల్మీకి జయంతిని అధికారిక సాంస్కృతిక కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు సీఎం రేవంత్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొమురం భీమ్,వాల్మీకి చిత్రపటానికి నివాళులు అర్పించిన వారిలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version