మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి రెగ్యులర్ ఫ్లైట్‌లో వెళ్లనున్నారు.

ఎన్నికల ప్రక్రియ ముగియడంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రేపు (శనివారం) కీలక భేటీకి పిలుపునిచ్చింది. లోక్ సభ ఎన్నికల తర్వాత జరుగనున్న ఫస్ట్ సీడబ్ల్యూసీ సమావేశాలకు హాజరయ్యేందుకు రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌కు వెళ్తున్నారు. ఈ భేటీకి సీడబ్ల్యూసీ మెంబర్స్‌తో పాటు ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచందర్‌రెడ్డితో పాటు,శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహ, అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా పీసీసీ చీఫ్‌ హోదాలో ఈ భేటీకి వెళ్తున్నారు.రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎంపీలు కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version