70 ఏళ్లు గడుస్తున్నా ఇంకా బీసీలకు న్యాయం జరుగడం లేదు : విహెచ్ హనుమంతరావు

-

కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంత రావు స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే కులగణన బిల్లును ఆమోదించాలని ,ఈ విషయాన్ని తాను ఇక్కడితోనే వదిలిపెట్టబోను అని చెప్పారు.

ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసి కులగణన చేపట్టాలని కోరుతా అని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా బీసీలకు న్యాయం జరుగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. బిహార్‌లో నితీష్ కులగణన చేస్తే 67 శాతం రిజర్వేషన్ బీసీలకు వచ్చిందని గుర్తు చేశారు. నితీష్, చంద్రబాబులు కూడా అన్ని రాష్ట్రాల్లో కుల గణన చేయాలని మోడీని కోరాలని సూచించారు.తెలంగాణలో కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే.. బీసీలకు మేలు జరుగుతుందని.. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version