కాంగ్రెస్: మమతా బెనర్జీ లేని కూటమిని అస్సలు ఊహించలేము..!

-

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యం లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి జయ రాం రమేష్ స్పందించారు మమతా బెనర్జీ లేని ఇండియా కూటమిని ఊహించలేమని అన్నారు. అస్సాం లో జయరాం రమేష్ మీడియా తో మాట్లాడటం జరిగింది ఇండియా కూటమికి టీఎంసీ కీలక భాగస్వామి అన్నారు.

టిఎంసితో ఇంకా చర్యలు జరుపుతామని త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు పశ్చిమ బెంగాల్ జోడో న్యాయ యాత్రపై తనకి సమాచారం ఇవ్వలేదని మమతా బెనర్జీ చేసిన ఆరోపణ గురించి స్పందిస్తూ భారత జోడో న్యాయ యాత్రకి అన్ని పార్టీలకి ఆహ్వానాన్ని అందించినట్లు చెప్పారు. మమతా బెనర్జీ ప్రకటనపై ఆర్ డి ఎంపీ మనోజ్ షా కూడా స్పందించారు ఏదైనా సమస్య ఉంటే కూటమి పరిష్కరిస్తుంది అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news