కేటీఆర్ 420 అని అందరికీ తెలుసు.. షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

-

ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను పూర్తి చేయడం మా బాధ్యత అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డిక్లరేషన్ పై ఇచ్చిన హామీలపై బడ్జెట్ ఎంత అనే దానిపై సమీక్ష చేస్తున్నామన్నారు. రేపు, ఎల్లుండి సెక్రటరీలతో సమావేశమవుతామని తెలిపారు. బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఇచ్చిన హామీల అమలుకు ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై ప్రధానం చర్చ చేస్తామని వెల్లడించారు.

కేటీఆర్ 420 అని అందరికీ తెలుసు అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. హైదరాబాద్ లో చిన్న ప్లాట్ కూడా లేకుండే.. ఇప్పుడు ఏ ఫామ్ హౌస్ చూసినా కేటీఆర్ దే అంటున్నారు. 100 రోజుల్లో పూర్తి చేస్తామని హామీలు ఇచ్చాం.. అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. మేము పుట్టిన 24 రోజులకే హామీలు ఏమైంది అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దళితులకు మూడు ఎకరాల భూములు, మైనార్టీ రిజర్వేషన్ ఏమైంది కేటీఆర్ అని ప్రశ్నించారు షబ్బీర్ అలీ. మేడిగడ్డ ప్రాజెక్టు పై క్రిమినల్ కేసులు పెట్టాలి.. ఎవరి డైరెక్షన్ లో చేశారు అనేది తేల్చాలి. కేటీఆర్ ఫోన్ లో ఆదేశాలు ఇవ్వగానే 100 కోట్ల రూపాయలు ఇచ్చాడట. ఇది ఎట్లా సాధ్యం అయింది ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news