మూసీ నిర్వాసిత రైతులకు కాంగ్రెస్ ఎంపీ చామల కీలక పిలుపు..

-

మూసీ ప్రక్షాళనను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్న తరుణంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మూసీ నిర్వాసిత రైతులకు కీలక పిలుపునిచ్చారు.పూర్వం సాగు,తాగు నీటి అవసరాలు తీర్చిన మూసీ నది.. మానవ తప్పిదాల కారణంగా కాలుష్యం కోరల్లో చిక్కుకుని దుర్గంధం వెదజల్లుతోందన్నారు. అందుకే మూసీ నది ప్రక్షాళన గురించి చర్చించేందుకు ఈ నెల 5వ తేదీన సాయంత్రం 4 గంటలకు నాగోల్ శుభం గార్డెన్‌లో నిర్వహించే రైతు సమావేశానికి ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులతో పాటు మూసీ పరివాహక ప్రాంత రైతులంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మూసీపై చర్చించి ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. గోదావరి జలాలను మూసీలో ప్రవహింపచేయాలని ప్రభుత్వం భావిస్తోందని తెలిపారు.గతంలో ఫ్లోరైడ్ సమస్యను అధిగమించిన మనమంతా ఇప్పుడు మూసీ నది ప్రక్షాళన సమయంలో ఒక్కటిగా ముందుకు సాగాలని, మూసీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలని ఎంపీ చామల విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version