కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

-

కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిందని బిజెపి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి కంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డితో కలిసి శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ, చౌదరి గూడలో ఇంటింటికి తిరుగుతూ బిజెపి పార్టీ కమలం గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ గ్రామం వెళ్లిన ప్రతి ఒక్కరు మోడీ మోడీ అంటున్నారన్నారు. పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిందని ఏ ఒక్క ఆమెను కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు చెప్పుకోవడానికి ఏమి లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version