రామ మందిరంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసింది: బండి సంజయ్

-

కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు బండి సంజయ్ ఆంధ్ర ప్రదేశ్ కి వెళ్లారు.

ఈ కార్యక్రమం అనంతరం బండి సంజయ్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 88 ఎమ్మెల్యే సీట్లు సాధించి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తామని ఆశా భావం వ్యక్తం చేశారు.రామ మందిరంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష నిర్వహిస్తామని తెలిపారు. కాగా, గతేడాది తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ 8 ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది

.

Read more RELATED
Recommended to you

Latest news