వినాయ‌కుడి నిమ‌జ్జ‌నంలో విషాదం…గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

-

వినాయ‌కుడి నిమ‌జ్జ‌నంలో విషాదం చోటు చేసుకుంది…గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందాడు.
ఘట్‌కేసర్‌లో వినాయకుడి ఊరేగింపు సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. కాలనీ వినాయకుడి ఊరేగింపులో పాల్గొన్న కానిస్టేబుల్ కే. డేవిడ్ (31) డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సహచరులు, బంధువులు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే డేవిడ్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

conistable
conistable

కుటుంబసభ్యులు, సహచరులు ఈ ఘటనతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆనందంగా ప్రారంభమైన ఊరేగింపు క్షణాల్లోనే దుఃఖవాతావరణంగా మారింది. గుండెపోటు కారణంగానే డేవిడ్ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.

డేవిడ్ మృతితో ఊరేగింపులో పాల్గొన్న స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వయసు తక్కువగా ఉండడం, ఆరోగ్య సమస్యల గురించి పెద్దగా ఎవరికి తెలియకపోవడంతో మరణం మరింత బాధాకరంగా మారింది. ఆయన అంత్యక్రియలకు సహచర పోలీసులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశముంది.

 

Read more RELATED
Recommended to you

Latest news