బిగ్ బ్రేకింగ్; తెలంగాణాలో ఒక్క రోజే 56 కేసులు…!

-

తెలంగాణాలో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. తాజాగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. నేడు ఒక్క రోజే 56 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. 23 మంది ఇప్పటి వరకు తెలంగాణాలో ప్రాణాలు కోల్పోయారు. దీనితో తెలంగాణాలో మొత్తం ఇప్పటి వరకు 928 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణాలో పూర్తిగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య… 194 గా ఉంది.

యాక్టివ్ కేసులు 711 గా ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలో ఈ ఒక్క రోజే 26 కరోనా కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో 19 కరోనా కేసులు బయటపడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో మూడు కేసులు, గద్వాల్ లో రెండు కేసులు నమోదు అయ్యాయి. అదిలాబాద్ లో 2 కేసులు, ఖమ్మం, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కో కొత్త కేసు నమోదు అయింది. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కరోనా ఈ స్థాయిలో పెరగడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news