దేశంలో కరోనా కేసులు మళ్ళీ పెరిగాయి… అడ్డూ అదుపూ లేదా !

-

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయే తప్ప.. తగ్గేలా అనిపించడం లేదు. వాస్తవంగా కరోనా అంటువ్యాధి కావడం వలన ఒకరి నుండి మరొకరికి చాల త్వరగా వ్యాపిస్తోంది. తద్వారా కేసులలో పెరుగుదల భారీగా కనిపిస్తోంది. ఒకవైపు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు ధరించి బయటకు వెళ్ళండి అంటూ గీ పెట్టి చెబుతున్నా వినిపించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొందరి వలన అమాయక ప్రజలు బలైపోతున్నారు అని చెప్పాలి. కాగా ఈ రోజు అప్డేట్ ప్రకారం గడిచిన 24 గంటలలో 5880 కేసులు నమోదు అయ్యాయి.

ఇక ఆల్రెడీ యాక్టీవ్ గా ఉన్న కేసులతో కలుపుకుంటే ప్రస్తుతం ఉన్న కేసులు సంఖ్య 35199 కు చేరింది. సో .. పరిస్థితులు చూస్తుంటే మళ్ళీ ఆ మునుపటిలాగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇకనైనా మాస్క్ ధరించి మాత్రమే ఎక్కడికైనా వెళ్ళండి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version