టీఆర్ఎస్ సీనియర్ నేతకు కరోనా.. దుబ్బాకలో టెన్షన్ ?

-

టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి సునీతా లక్ష్మా రెడ్డి కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమె గత నెల రోజులుగా దుబ్బాక టీ ఆర్ ఎస్ అభ్యర్థికి మద్దతుగా పలువురు నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొంది. ప్రస్తుతం ఆమెకు స్వల్ప లక్షణాలే కనిపించడంతో ఆమె హోం క్వారంటైన్ లో మాజీ మంత్రి చికిత్స పొందుతున్నారు.

అయితే ఆమెతో కలిసి సీనియర్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొనడంతో వారందరిలో టెన్షన్ నెలకొంది. ఈ నేపధ్యంలో దుబ్బాక ప్రజల్లో కూడా టెన్షన్ నెలకొంది. దుబ్బాక ఉప ఎన్నికకు రేపే పోలింగ్ జరగనుంది. రేపు 1,98,807 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉప ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కోవిడ్ నిబంధనలతో పోలింగ్ జరగనుండగా అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు మరో ఇరవై మంది బరిలో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version