ఇండియాలో మళ్ళీ భారీగానే కరోనా కేసులు

-

భారత్ లో రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒకరకంగా భారత్ లో కరోనా వైరస్ విజృంభిస్తున్నదని చెప్పచ్చు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన లెక్క ప్రకారం కేసుల సంఖ్య 22 లక్షల దాటింది. గడచిన 24 గంటలలో అత్యధికంగా 62,064 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలానే గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,007 మంది మృతి చెందారు.

ఇక అలానే దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,15,075కు చేరింది. ఇప్పటి దాకా దేశ వ్యాప్తంగా డిశ్ఛార్జ్ అయిన వారి సంఖ్య 15,35,744కు చేరింది. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా 6,34,945 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక దేశంలో కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 44,386కు చేరింది. గడచిన 24 గంటలలో 4,77,023 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు దేశంలో 2,41,06,535 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version