ప్రధాని మోడీ టూర్‌…విశాఖ, రామగుండం బంద్ కు పిలుపు

-

ప్రధాని మోడీ..విశాఖ, రామగుండం టూర్‌ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలోనే.. విశాఖ, రామగుండం బంద్‌ కు సీపీఐ పార్టీ తరఫున నారాయణ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసం చేసి.. రక్తసిక్త హస్తం లో వస్తున్నారని.. ప్రధానిగా వచ్చి అమరావతి కి శంకుస్థాపన చేసి.. అది అమలు కాకపోతే ప్రధానికి సిగ్గులేదా? అని ప్రశ్నించారు నారాయణ.

విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మేసి విశాఖ కి మోడీ వస్తున్నారని..రుషికొండ కి ఓ సారి వెళ్లి పరిశీలించండని ఫైర్‌ అయ్యారు. కన్నబాబు ias చదివాడా..? Iti చదవాడా..? నేను క్యూబాలో ఉంటే ఒకటి రెండు రోజుల్లో రుషికొండ వెళ్ళండి అని నాకు సమాచారం ఇచ్చాడంటూ ఎద్దేవా చేశారు నారాయణ. తెలంగాణ విభజన హామీలు అమలు చేయని మోడీ ఏ మొహం పెట్టుకుని వస్తున్నారని నిలదీశారు. రామగుండం బంద్ కి పిలుపు నిస్తున్నామని.. నల్లజెండాల ప్రదర్శన చేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు నారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version