షాకింగ్ : విశాఖ శారదా పీఠంను సందర్శించిన సీపీఐ నారాయణ

-

 జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో సిపిఐ జాతీయ నాయకులు నారాయణ శారదపీఠంలో స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం తీసుకోవడం సంచలనంగా మారింది. చినముషిడివాడలో 97 వ వార్డు అభ్యర్థి యశోద తరఫున నారాయణ  ఓట్లు అడిగారు. అయితే కమ్మ్యూనిస్ట్ జాతీయ నేత అయి ఉండి శారదా పీఠంకు సిపిఐ నారాయణ వెళ్లడంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

జీవీఎంసీ 97వ వార్డు సీపీఐ అభ్యర్థి యశోద ఎన్నికల ప్రచారంలో భాగంగా చినముషిడివాడ నిర్వహించిన ప్రచారంలో నారాయణ పాల్గొన్నారు. అందులో భాగంగానే దారిలో ఉన్న విశాఖ శారదా పీఠాన్ని నారాయణ సందర్శించారు. ఆ పీఠాన్ని దర్శించుకుంటే గెలుపు ఖాయమని అంటుంటారని తమ అభ్యర్ధిని కూడా నిండు మనసుతో ఆశీర్వదించాలని నారాయణ కోరినట్లు సమాచారం. 

Read more RELATED
Recommended to you

Latest news