అక్రమ సంబంధం.. భర్తకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందన్న అనుమానంతో

-

లవర్‌ భర్తపై హత్యాయత్నం చేసిన సంఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేసి.. రిమాండ్‌ కు తరలించారు. వేముల వాడ టౌన్‌ సీఐ వెంకటేష్‌ తెలిపిన వివరాల ప్రకారం… వేముల వాడకు చెందిన మహిళకు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం తిప్పాయపల్లెకు చెందిన విష్ణుతో 2011లో వివాహం అయింది.

విష్ణు ఉపాధి కోసం దుబాయి వెళ్లి వస్తుండగా.. అతని భార్య వేముల వాడకు చెందిన సాయికుమార్‌ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. గత మూడు సంవత్సరాలుగా భర్తకు దూరంగా ఉంటుంది. ఇటీవల మళ్లీ భర్త విష్ణుకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుందన్న అనుమానం సాయికుమార్‌ కు కలిగింది.

బుధవారం రాత్రి విష్ణు వేముల వాడ మీదుగా కరీంనగర్‌ వెళుతున్నట్లు తెలుసుకుని తన స్నేహితుడు దేవేందర్‌ తో కలిసి హత్‌యకు ప్రయత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్న విష్ణు వేముల వాడ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కు ఫిర్యాదు చేశాడు. సాయికుమార్‌, దేవేందర్‌ లను పోలీసులు రిమాండ్‌ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version