ఆర్యసమాజ్ లో పెళ్లి..వధువు కుటుంబం రౌడీల తో వచ్చి..!

-

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతానికి చెందిన ఓ యువకుడు హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడే ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి రాగా యువతి తల్లిదండ్రులు రౌడీల తో వచ్చి బెదిరించి అమ్మాయిని తీసుకెళ్లారు. ఈ ఘటన పెద్దపెల్లి జిల్లా సిఎస్పీ కాలనీ లో చోటు చేసుకుంది. శనిగారం సాయి అనే యువకుడు హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

అదే కంపెనీలో పనిచేస్తున్న ఉప్పల్ ప్రాంతానికి చెందిన శ్రీశాంక్ అనే అమ్మాయితో అతడికి పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. దాంతో వారిద్దరూ ఈ నెల 1వ తేదీన హైదరాబాద్ లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి గోదావరిఖని వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. తాజాగా తల్లి తో పాటు ఆమె మేనమామ గోదావరిఖనికి స్థానిక రౌడీషీటర్ ను తీసుకువచ్చి కత్తులు కర్రలతో సాయి కుటుంబ సభ్యులను బెదిరించి శ్రీశాంక్ ను కారులో తీసుకెళ్లారు. దాంతో ఈ ఘటనపై సాయి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులను ఆశ్రయించారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version