డిస్కౌంట్ ఇవ్వలేదని పిట్టలను కాల్చినట్టు కాల్చేశాడు..!

-

డిస్కౌంట్‌పై గొడవ.. ఇద్దరు వ్యక్తులను ఉత్తి పుణ్యానికి పొట్టన పెట్టుకున్నది. డిస్కౌంట్ ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి ఇద్దరు వ్యక్తులను కాల్చి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో చోటు చేసుకున్నది. ఈ ఘటనలో మరో ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వారణాసిలోని జేహెచ్‌వీ మాల్‌లో ఉన్న ఓ రెడీమెడ్ డ్రెస్సుల షోరూంకు ఇద్దరు కస్టమర్లు వెళ్లారు. డ్రెస్సులు చూశారు. కొన్ని నచ్చాయి.. కానీ డిస్కౌంట్ దగ్గర వాళ్లు అందులో పనిచేసే వ్యక్తితో గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ కాస్త పెరిగి పెద్దదయింది. దీంతో కస్టమర్లలో ఓ వ్యక్తి కోపంతో తన దగ్గర ఉన్న తుపాకీ బయటికి తీసి టపా టపా కాల్పులు జరిపాడు. దీంతో షోరూంలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని షోరూంను సీల్ చేశారు. పీక్ అవర్స్ కావడంతో ఆ సమయంలో మాల్‌లో చాలామంది జనాలు ఉన్నారని.. వాళ్లంతా భయంతో పరుగులు తీసేసరికి.. వెంటనే అందరినీ మాల్ నుంచి బయటికి పంపించామని పోలీసులు తెలిపారు. మాల్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామని.. నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version